నల్గొండ, యాద్రాద్రి భువనగిరి జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పి-ఈసెట్ 2018) దేహదారుడ్య పరీక్షలను వేరేచోటికి మార్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో గల డాక్టర్ ముస్కు మధుసూదన్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంఎంఆర్ కాలేజీ)లో, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వలన పి-ఈసెట్ ఫిజికల్ టెస్ట్ వేరే చోటుకు మార్చవలసి వచ్చిందని ప్రకటనలో తెలిపారు. కనుక ఈ రెండు ప్రాంతాలలో పి-ఈసెట్ ఫిజికల్ టెస్ట్ కు హాజరుకాబోతున్న విద్యార్ధులు మళ్ళీ పి-ఈసెట్ వెబ్ సైటులో కొత్త హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు.