సంధ్య థియేటర్ కేసు విచారణకు అల్లు అర్జున్‌ డుమ్మా!

June 22, 2026
img

అల్లు అర్జున్‌ నేడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ముంబయిలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున హాజరు కాలేకపోయారు. 

2024, డిసెంబర్‌ 4న హైదరాబాద్‌, సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి నేటికీ చికిత్స పొందుతున్నాడు. చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్‌ పేరు ఏ-11గా చేర్చారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్‌ స్వయంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

కానీ షూటింగ్‌ కారణంగా హాజరుకాలేకపోతున్నారని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన న్యాయవాదులు నాంపల్లి కోర్టుని అభ్యర్ధించారు. దీనిపై న్యాయస్థానం స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. 

Related Post