కొండా సురేఖగారు వందకోట్లు రెడీగా ఉంచుకోండి!

October 05, 2024
img

మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం ప్రతిష్టని, తమ మనోభావాలను దెబ్బ తీసేవిదంగా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో ఓ క్రిమినల్ కేసు వేసిన సంగతి తెలిసిందే.

ఆమెపై ఆగ్రహంతో రగిలిపోతున్న నాగార్జున ఆమెపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా కూడా వేయబోతున్నట్లు చెప్పారు.

“ఈ విషయంలో ఆమె చాలా తప్పుగా మాట్లాడారు. ఆమె సమంతకి క్షమాపణలు చెప్పారు కానీ మాకు చెప్పలేదు. కనీసం ఆవిదంగా మాట్లాడినందుకు పశ్చాతాప పడటం లేదు. ఒకవేళ ఆమె ఇప్పుడు మాకు క్షమాపణలు చెప్పినా మేము పరువు నష్టం దావా వేస్తాము. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. 

కొంతకాలంగా ఒకదాని తర్వాత మరొక సమస్యలు మమ్మల్ని చుట్టుముడుతుంటే మౌనంగా, నిబ్బరంగా అన్నిటినీ భరిస్తున్నాము. మా కుటుంబ విషయాల గురించి చాలా మంది ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నప్పటికీ ‘ఇదే చివరిసారి... ఈసారికి పట్టించుకోకుండా వదిలేద్దాం’ అని అనుకుంటూ చాలా భరించాము. దానిని అలుసుగా భావించి కొందరు రెచ్చిపోతున్నారు. ఇకపై నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదు.

సినిమా ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలబడింది. మా నాన్నగారి మంచితనమే మాకు ఈ రూపంలో ఆశీర్వాదంగా లభిస్తోందని నేను భావిస్తున్నాను,” అని నాగార్జున అన్నారు.

Related Post