బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తున్న అఖండ-2: తాండవం ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబర్ 5న అఖండ-2: తాండవం తప్పదని సితారా ఎంటర్టైన్మెంట్స్ స్పష్టం చేసింది. ఇదివరకు విడుదల చేసిన టీజర్లో రిలీజ్ డేట్ జోడించారు.
అఖండ-2: తాండవంలో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నఅఖండ-2 ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.