రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో తీస్తున్న సినిమా నుంచి అప్డేట్స్ లేవని బాధపడుతున్న అభిమానులకు అదిరిపోయే వార్త ఇది. ఈ నెల 14 సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ ఛాంబర్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు రాజమౌళి.
ఈ విషయం తెలియజేస్తూ ఎస్ఎస్ఎంబీ29 ఎటువంటి సినిమాగా తీయాలని ప్రేక్షకులను అడుగుతున్నప్పుడు తీసిన వీడియో క్లిప్ కూడా జోడించారు.
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ అవతార్-3 ప్రమోషన్స్ కోసం భారత్కి రానున్నారు. కనుక నవంబర్ 15వ తేదీన హైదరాబాద్లో అట్టహాసంగా ఓ కార్యక్రమం నిర్వహించి దానిలో ఆయన చేత ఈ సినిమా టైటిల్, పోస్టర్ విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలోనే ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ గ్లిమ్స్ వీడియో కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రియాంకా చోప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబీ29కి ‘వారణాసి’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం.
The time is near….what better place to celebrate this big moment than at the heart of TELUGU CINEMA? 🤗
— S S Karthikeya (@ssk1122) November 5, 2025
So much love, so much excitement and it’s all for you on Nov 15th at Ramoji Film City…
The world will revolve around #GlobeTrotter now… 🌍#GlobeTrotterEvent @JioHotstar pic.twitter.com/VETD4BiP1N