ఢిల్లీ-గోవా విమానంలో ఉగ్రవాది...

October 23, 2020
img

నిన్న ఢిల్లీ నుంచి గోవా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో జియా ఉల్ హక్ అనే వ్యక్తి చాలా హడావుడి చేశాడు. తాను స్పెషల్ బ్రాంచ్ అధికారినని, ఈ విమానంలో ఓ ఉగ్రవాది ఉన్నాడని ప్రకటించడంతో విమాన సిబ్బందితో సహా ప్రయాణికులందరూ తుళ్ళిపడ్డారు. ఉగ్రవాది విమానాన్ని హైజాక్ చేసాడేమోనని అందరూ తీవ్ర ఆందోళన చెందారు. కానీ ఆ స్పెషల్ బ్రాంచ్ అధికారి హడావుడి తప్ప అటువంటిదేమీ జరుగలేదు. విమానం సురక్షితంగా గోవా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విమానసిబ్బంది, ఎయిర్ పోర్ట్ అధికారులు కలిసి హడావుడిగా ప్రయాణికులందరినీ విమానంలో నుంచి దించి బయటకు తరలించారు. ఆ తరువాత జియా ఉల్ హక్‌ను ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి మానసికవైద్యులను రప్పించి పరీక్షింపజేశారు. అతను మానసిక సమస్యతో ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. అప్పుడు గానీ ఎవరూ ఈ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. అతనిని పోలీసులు చికిత్స నిమిత్తం పనాజీలో మానసిక వ్యాదుల ఆసుపత్రికి తరలించారు.              


Related Post