పవిత్ర రంజాన్ మాసం చివరి రోజైన శుక్రవారం హైదరాబాద్ లో గల 600 చిన్నాపెద్ద మసీదులతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. రంజాన్ పండుగ సందర్భంగా 41 రోజుల పాటు కటిన ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలందరూ శనివారం తమ దీక్షలను విరమించి ఘనంగా ఈదుల్ ఫిత్ పండుగ జరుపుకోనున్నారు. ఈరోజు కూడా అన్ని మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతాయి. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు రాష్ట్రంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.