అయోధ్య రామయ్యకు సూర్య తిలకం

March 27, 2026
img

నేడు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని బాల రామాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రంగు రంగు విద్యుదీపాలు, పువ్వులతో ఆలయాన్ని స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బాల రాముడిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు, వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు వారందరికీ ఓ అపూర్వ దృశ్యం చూసే భాగ్యం కలిగింది.

గర్భగుడిలో బాలరాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు తాకాయి. ఆ కాంతికి నుదుటన వజ్రాల నామాలు ధగధగ మెరిసాయి. ఈ దృశ్యం కళ్ళకు కట్టినట్లు చూసేందుకుగాను ఆ సమయంలో ఆలయంలో లైట్లు అన్ని ఆర్పేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.

ప్రధాని మోడీ సైతం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ అద్భుత దృశ్యం చూసి పులకించిపోయారు. తన జన్మ ధన్యమైందన్నారు. దూరదర్శన్‌లో ప్రసారం అయిన ఈ వీడియోని మీరు చూసి తరించండి. 

Related Post