భారత్-పాక్ మద్య యుద్ధం ప్రారంభం అవడంతో ఐపీఎల్-2025 నిరవధికంగా వాయిదా పడింది. పరిస్థితులు మళ్ళీ చక్కబడిన తర్వాత టోర్నీ ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్ ప్రకటిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
విశేషమేమిటంటే ఐపిఎల్ రద్దయింది కానీ హైదరాబాద్లో జరుగబోతున్న అందాల పోటీ మాత్రం యధాతధంగా జరుగబోతోంది.
ఓ పక్క భారత్-పాక్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేసుకుంటున్నప్పటికీ, వివిద దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకోగా ఆమెకు తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ కళాకారులు ఆమెకు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీల ప్రారంభోత్స వేడుకలు జరుగనున్నాయి.
ఓ పక్క పొరుగు దేశంతో యుద్ధం జరుగుతుండగా, మిస్ వరల్డ్-2025 పోటీలు నిర్వహిస్తుండటంపై విమర్శలే కాదు ప్రశంశలు కూడా వస్తున్నాయి.