డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి

April 25, 2025
img

ఇస్రో మాజీ ఛైర్మన్‌ డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి శుక్రవారం ఉదయం బెంగళూరులో తన నివాసంలో కన్ను మూశారు. ఆయన 1994 నుంచి 2003 వరకు తొమ్మిదేళ్ళ పాటు ఇస్రో ఛైర్మన్‌గా పని చేశారు. ఆయన హయంలోనే ఇస్రో తొలిసారిగా లూనార్ మిషన్‌కు సన్నాహాలు మొదలుపెట్టింది. 

డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్, కర్ణాటక నాలెడ్జ్ హబ్ కమీషన్ ఛైర్మన్‌, యూఆర్ఏసీ డైరెక్టర్‌, ప్రణాళికా సంఘం సభ్యుడుగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్ డైరెక్టర్‌ వంటి పలు ఉన్నతస్థాయి పడవులలో పనిచేశారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడుగా కూడా సేవలందించారు. 

డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం తెలిపారు. 

Related Post