ముంబయిలో ఒకే రన్‌వేపై ఒకే సమయంలో రెండు విమానాలు

June 09, 2024
img

ముంబయి విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగా అదే సమయంలో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. అయితే అప్పటికే ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి లేవడంతో వెనకనే వచ్చిన ఇండిగో విమానం దానిని గుద్దుకోకుండా తప్పించుకోగలిగింది. 

ఎయిర్ ఇండియా విమానం శనివారం ముంబయి నుంచి తిరువనంతపురంకు బయలుదేరుతుండగా, అదే సమయంలో ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో రెండు విమానాల మద్య పావు కిలోమీటర్ కంటే తక్కువ దూరం ఉంది. 

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు వెంటనే స్పందిస్తూ, తమ పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనల ప్రకారమే టేకాఫ్, ల్యాండింగ్ చేశారని కనుక తమ పైలట్ల తప్పు ఏమీ లేదని స్పష్టం చేశాయి. 

ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ ఇందుకు బాధ్యులైన ముంబయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగులని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. 

రెండు విమానాలలో ప్రయాణికులకు ఈ విషయం దిగిన తర్వాత తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ వేగంగా దూసుకు వెళుతున్న రెండు విమానాలు రన్‌వేపై గుద్దుకొని ఉంటే తమ ప్రాణాలు పోయేవని, బాధ్యులపై కటిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">Single most dangerous situation I’ve seen in an Indian airport. Don’t know how this happened in Mumbai yesterday, but the ATC needs to face jail time for this - unless the Indigo pilot disobeyed orders. <a href="https://t.co/R1s6d7btzI">pic.twitter.com/R1s6d7btzI</a></p>&mdash; Abhijit Iyer-Mitra (@Iyervval) <a href="https://twitter.com/Iyervval/status/1799690679536468398?ref_src=twsrc%5Etfw">June 9, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Related Post