కొండ పొలం నవల ఆధారంగా క్రిష్ సినిమా..!

 తెలుగులో ఉన్న క్రేజే డైరక్టర్స్ లో ఒకరైన క్రిష్ తాను ఏ సినిమా చేసినా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు నిరాశపరచగా కొద్దిపాటి గ్యాప్ తో పవర్ స్టార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న క్రిష్ ఆ సినిమాకు కొద్దిగా టైం ఉందని మధ్యలో మరో సినిమా మొదలుపెట్టాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు చిత్రయానిట్.  

క్రిష్ ఈ సినిమాను కొండ పొలం నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ఈ నవలా హక్కులను కొని అదే కథతో సినిమా చేస్తున్నాడు క్రిష్. అడవి జంతువులూ తిరిగే చోట నీరు కూడా దొరకని పరిస్థితుల్లో రైతు జీవనం ఎలా సాగింది అన్న కథతో ఈ సినిమా వస్తుంది. రీసెంట్ గా మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ తక్కువ రోజుల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు క్రిష్.