
సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 550 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచగా ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజై సంచలనం సృష్టిస్తుంది. అంచనాలకు తగినట్టుగానే శంకర్ చేసిన అద్భుత సృష్టి ఈ 2.ఓ అనేలా ఉంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
సినిమాలో రజినికి ప్రతి నాయకుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నవంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టేసింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా టేకింగ్ ఉంది. రోబోతో సంచలనాలు సృష్టించిన శంకర్ 2.ఓ తో ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.