
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేసిన అఖండ 2: నుంచి తాండవం పాట రేపు విడుదల కాబోతోంది. అఖండ సూపర్ హిట్ అయినందున ఈ సినిమాపై నమ్మకంతో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు. కనుక ఉత్తరాదిన కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది కనుక ముంబయి, జుహూలో పీవీఆర్ మల్టీప్లెక్స్లో శుక్రవారం సాయంత్రం ఈ సినిమాలోని ‘తాండవం’ పాట లాంచింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో అఖండ-2 నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.