
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ‘ఓజీ’లో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈరోజు ప్రకాష్ రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతోంది.