
సినిమాలలో దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు వేరు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో ‘కుబేర’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారికి ఎదురుచూపులకు జూన్ 20వ తేదీతో ముగియబోతున్నాయి. ఆరోజు కుబేర ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమాలో నాగార్జున కోటీశ్వరుడైన వ్యాపారవేత్తగా నటిస్తుండగా, ధనుష్ బిచ్చగాడిగా నటిస్తున్నారు. రష్మిక, జిమ్ సరబ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.