
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తున్న అఖండ-2: తాండవం నుంచి తొలి పాట ‘తాండవం’ ప్రమో శుక్రవారం విడుదల కాబోతోంది. పూర్తిపాట మర్నాడు విడుదల చేయవచ్చు.
అఖండ-2: తాండవం డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. కనుక ఇటీవలే టీజర్ విడుదల చేసి ఇప్పుడు మొదటి పాట విడుదలకు సిద్దమవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున ఇక నుంచి సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగబోతున్నాయి.
అఖండ-2: తాండవంలో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నఅఖండ-2 ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.