
రితేష్ రాణా దర్శకత్వంలో మత్తు వదలరా-2 సెప్టెంబర్ 13వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కంటే ట్రైలర్ ఇంకా బాగుంది. కామెడీ, క్రైమ్ కలిపి సరిగ్గా సినిమా తీయగలిగితే సూపర్ హిట్ అవుతుందని రాంగోపాల్ వర్మ ఎప్పుడూ నిరూపించి చూపారు. కనుక దర్శకుడు రితేష్ రాణా కూడా ఈ సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు.
ఈ సినిమాలో శ్రీ సింహా, సత్య, వెన్నెల కిషోర్, ఫారియా అబ్దుల్లా, సునీల్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. కామెడియన్లు అందరూ కలిసి యాక్షన్ సీన్స్ చేస్తే ఎంత హాస్యం పండించగలరో టీజర్, ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది.
2019లో వచ్చిన ‘మత్తు వదలరా’కి సీక్వెల్గా దీనిని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల చిరంజీవి (చెర్రీ), హేమలత పెడమళ్ళు కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం: కాల భైరవ, కెమెరా: సురేష్ సారంగం, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.