
వైకుంఠ్ బోను దర్శకత్వంలో మహేంద్రన్, అంబికావాణి జంటగా చేసిన ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదలైంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో మహిమాన్వితమైన ‘బ్రహ్మ పదార్ధం’ దొంగిలించుకుపోయేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తుంటే వాటిని హీరో అడ్డుకోవడమే ఈ సినిమా కథ.
ఈ సినిమాలో జాన్ విజయ్, మీమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, ఉలాసి, రాజీవ్ కనకాల, తర్జన్, రామరాజు, భద్రం, జబర్దస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేతా బజాజ్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వైకుంఠ్ బోను, పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీహర్ష ఎమాని, సంగీతం: మణిశర్మ, కెమెరా: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్), స్టంట్స్: రామకృష్ణ చేశారు.
రెయిన్బో సినిమాస్ బ్యానర్పైపై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన వాసుదేవసుతం జూలై 10న థియేటర్లలో విడుదల కాబోతోంది.