గోపీచంద్ భీమా ట్రైలర్‌ రేపే విడుదల

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో గోపీచంద్ ‘భీమా’ సినిమా ట్రైలర్‌ శనివారం సాయంత్రం 4 గంటలకు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో గోపీ చంద్‌కు హీరోయిన్లుగా మాళవిక శర్మ, భవానీ శంకర్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో గోపీ చంద్‌ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరు నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన భీమా టీజర్‌లో గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష, సంగీతం: రవి బస్రూర్, కొరియోగ్రఫీ: డాక్టర్ రవి వర్మ, కెమెరా: స్వామి జె గౌడ, స్టంట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. భీమా సినిమాని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న భీమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.