హైదరాబాద్‌లో గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. అయితే హైదరాబాద్‌లో ఎక్కడ నిర్వహించబోతోందనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఆదే రోజున ఈ సినిమా ట్రైలర్‌ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. 

 ఖలేజా తర్వాత మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కనుక గుంటూరు కారంపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. 

గుంటూరు కారం సినిమా మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేసారు. 

ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేసారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న గుంటూరు కారం సినిమా విడుదల కాబోతోంది.