
త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి... అంటూ మరో హుషారైన పాట ప్రమోని ఈరోజు విడుదల చేశారు. శనివారం పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తామని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రకటించింది.
రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాటను తమన్ స్వరపరిచారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన పాటతో పోలిస్తే ఈ పాత చాలా హుషారుగా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల హై ఓల్టేజ్ డ్యాన్స్ చాలా బాగుంది. పాత, సంగీతం, డ్యాన్స్ మూడు సరిగ్గా కుదిరినందున ఈ పాట తప్పకుండా అభిమానులకు నచ్చుతుంది.
గుంటూరు కారం సినిమా మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.