
మాస్ మహారాజ రవితేజ స్టువర్టుపురం గజదొంగగా నటిస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రవితేజకు హీరోయిన్లుగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో ఆనాటి ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్ దాచారం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
వంశీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, కెమెరా: ఆర్ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్-లుక్ ఈ నెల 24న రాజమండ్రిలో విడుదల చేయబోతునట్లు తెలుస్తోంది.