ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ మరియు వివిధ రంగాలలో విశేషకృషి చేసినవారికే ఏటా అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఎక్సలెన్స్ అవార్డులకు రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రకటించింది. ఆగస్ట్ 15 సందర్భంగా రేపు వారికి ఈ అవార్డులు అందించబడతాయి.
ఈ అవార్డులను మూడు కేటగిరీలుగా విభజించారు. 1. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక పధకాలను సమర్ధంగా అమలుచేయడం. 2.వ్యక్తిగత, గ్రూపులు మరియు సంస్థల పనితీరును బట్టి అవార్డులు. 3. వినూత్న కార్యక్రమాల అమలు.
ప్రభుత్వ కార్యక్రమాల అమలు:
కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్: జ్యోతి బుద్ధ ప్రకాశ్ (ఆదిలాబాద్ కలెక్టర్), కె.కృష్ణారెడ్డి (జాయింట్ కలెక్టర్), సీహెచ్.సూర్యనారాయణ(ఆర్డీవో), ఆర్.అరవింద్కుమార్(సూపరింటెండెంట్).
హరితహారం: సురేంద్రమోహన్ (సూర్యాపేట కలెక్టర్) ప్రస్థాన్ జె.పాటిల్ (వరంగల్ రూరల్ కలెక్టర్),
ఆరోగ్యలక్ష్మి: గౌరవ్ (ఉప్పల్), నల్లగొండ కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ విభాగం.
ప్రతిష్టాత్మక పధకాల అమలు:
మిషన్ భగీరథ: వెంకట్రామరెడ్డి (సిద్దిపేట కలెక్టర్), ఆర్డబ్ల్యూఎస్ విభాగం
మిషన్ కాకతీయ: రాజీవ్గాంధీ హన్మంతు (భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్), ఇరిగేషన్ విభాగం
సాధారణ కార్యక్రమాల అమలు:
హెచ్ఐవీ బాధిత పిల్లల పునరావాస ప్రాజెక్టు: డి.యోగితా రాణా (నిజామాబాద్ కలెక్టర్), మానవతా సదన్,
ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కల్పించడం: ఏ.మురళి (భూపాలపల్లి కలెక్టర్), డీఎంహెచ్వో అప్పయ్య, (ములుగు), గోపాల్ ( చిట్యాల), రవి ప్రవీణ్రెడ్డి ( ఏటూరు నాగారం), అపర్ణ (మహదేవ్పూర్), వాసుదేవరెడ్డి.
ధాన్యం సేకరణ: డాక్టర్ శరత్ (జగిత్యాల కలెక్టర్), జిల్లా సివిల్ సప్లైస్ విభాగం
డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్: టి.చిరంజీవులు (హెచ్ఎండీఏ కమిషనర్), హెచ్ఎండీఏ
ఉట్నూర్ ఐటీడీఏలో స్టార్–30 కార్యక్రమం: జ్యోతి బుద్ధ ప్రకాశ్ (ఆదిలాబాద్ కలెక్టర్), ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతి (ఐఏఎస్లు)
వినూత్న కార్యక్రమాలు:
ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మార్షల్ ఆర్ట్స్, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాలు: ఎ.దేవసేన (జనగాం కలెక్టర్)