సిఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రెస్మీట్ పెట్టి సుమారు రెండున్నర గంటల పాటు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్లో అనేక లోపాలను ఎత్తి చూపుతూ కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సిఎం కేసీఆర్ ఏమన్నారో క్లుప్తంగా...
• కేంద్ర బడ్జెట్ ఓ గోల్మాల్ గోవిందం బడ్జెట్. దానికి దశ, దిశ ఏమీ లేదు. నిర్మలా సీతారామన్ దేశ ప్రజలను అంకెల గారడీతో దేశప్రజలను వంచించారు.
• దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతానికి పెరిగింది. కానీ వారి సంక్షేమానికి రూ.12,800 కోట్లు మాత్రమే కేటాయించింది. అదే...తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించినంత కూడా కేంద్రప్రభుత్వం కేటాయించలేకపోయింది.
• కరోనా కారణంగా దేశంలో వైద్యఆరోగ్య రంగాలను బలోపేతం చేసుకోవలసి ఉండగా వాటికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు.
• అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవలసి ఉండగా దానినీ పట్టించుకోలేదు. పైగా కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులను నిండా ముంచేస్తోంది.
• రాష్ట్రాల అనుమతి, ప్రమేయం లేకుండా నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం పెద్ద తప్పు.
• ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్ఐసీని అమ్మేస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పారు.
• క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను ఏవిదంగా విధిస్తారు?
ఇంకా పలు అంశాలపై సిఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించారు.