21 మందితో బిజెపి తొలిజాబితా విడుదల

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉన్నందున అన్ని పార్టీలు హడావుడిగా తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌, వామపక్షాలు తొలిజాబితాలను విడుదల చేశాయి. బిజెపి కూడా బుదవారం సాయంత్రం 21 మందితో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈరోజు రెండో జాబితాలో మరో 100 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

డివిజన్‌

అభ్యర్ధి పేరు

ఓల్డ్ మలక్‌పేట

కె రేణుక

పత్తర్ గట్టి

అనిల్ బజాజ్

మొగల్‌పురా

సి.మంజుల

పురానాపూల్

సురేందర్ కుమార్

కార్వాన్

కె.అశోక్

లంగర్ హౌస్

ఎస్‌. పుష్ప

టోలిచౌకీ

కె.రోజా

నానల్ నగర్

కరణ్ కుమార్

సైదాబాద్

కె. అరుణ

అక్బర్ బాగ్

నవీన్ రెడ్డి

డబీర్ పురా

మీర్జా అఖిల్ అఫండీ

రెయిన్ బజార్

ఈశ్వర్ యాదవ్

లలిత్ బాగ్

ఎం.చంద్రశేఖర్  

కూర్మగూడ

యు. శాంత

ఐఎస్ సదన్

జె.శ్వేత

రియాసత్ నగర్

మహేందర్ రెడ్డి

చంద్రాయణగుట్ట

జె.నవీన్ కుమార్

ఉప్పుగూడ

టి. శ్రీనివాస్ రావు

గౌలిపురా

ఎ. భాగ్యలక్ష్మి

శాలిబండ

వై.నరేశ్

దూద్ బౌలీ

నిరంజన్ కుమార్


సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినట్లు ప్రకటించారు. రవికుమార్ యాదవ్ నిన్న బిజెపిలో చేరిపోయారు. 


సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ మేయర్ బండ కార్తీక, ఆమె భర్త చంద్రారెడ్డి కూడా నిన్న బిజెపిలో చేరిపోయారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని చెప్పారు.