హైకోర్టు ఏఎస్జీగా నామవరపు రాజేశ్వర్‌రావు నియామకం

కేంద్రప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను నియమించింది. 2003 నుంచి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న నామవరపు రాజేశ్వర్‌రావును అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామవరపు రాజేశ్వర్‌రావు మూడేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఆ నియామక ఉత్తర్వులలో పేర్కొంది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ కీలక దశకు చేరుకొన్న ఈ సమయంలో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల పరిణామమే అని భావించవచ్చు. కానీ ఈ కేసు విషయంలో ఆయన జోక్యం లేదా ప్రమేయం ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ జోక్యం చేసుకొంటే ఆయన ఏమైనా సాధించగలరా లేదా?అనే ప్రశ్నలకు 7వ తేదీన తదుపరి విచారణ జరిగినప్పుడు సమాధానాలు లభించవచ్చు.