రాం చరణ్ అభిమాని మృతి..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ బుల్లి అభిమాని పరశురాం కామెర్ల కారణంగా మృతి చెందాడు. కొద్దిరోజులుగా కామెర్లతో బాధపడుతున్న పరశురాం సరైన వైద్యం తీసుకోక మరణించినట్టు తెలుస్తుంది. ఇక రెండు సంవత్సరాల క్రితం చరణ్ ను కలిసిన ఈ బుడతడు మగధీరలోని రాం చరణ్ డైలాగులతో చరణ్ ను ఇంప్రెస్ చేశాడు. తన చదువుకి కావాల్సిన డబ్బుని తాను ఇస్తానని చరణ్ మాటిచ్చారు.


అంతేకాదు చరణ్ గిఫ్ట్ గా ఓ టీ షర్ట్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. అయితే కామెర్లతో బాధపడుతున్న పరశురాం వైద్యం చేయిస్తున్నా రోగం ముదరడంతో తుది శ్వాస విడిచాడు. మెగా అభిమానులంతా అభిమాని మృతికి నివాళులు అర్పించారు. అయితే ఈ విషయం చరణ్ దాకా వెళ్లిందా లేదా అన్నది ఇంకా తెలియలేదు. చరణ్ కు తెలిస్తే కచ్చితంగా తన తరపున ఓ మెసేజ్ పాస్ చేసేవాడని అంటున్నారు.