మన శంకర వరప్రసాద్‌కి రాజసాబ్ దెబ్బ?

రాజాసాబ్ సినిమా టికెట్స్ పెంపు విషయంలో హైకోర్టు తీర్పు ప్రభావం సోమవారం విడుదల కాబోతున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్‌’పై కూడా పడటం ఖాయమే. కనుక తెలంగాణలో సినీ పరిశ్రమ ప్రేక్షుకులు, చిరంజీవి అభిమానులు సాధారణ టికెట్ ఛార్జీలతోనే ఈ సినిమా చూసే అవకాశం లభిస్తుంది. 

పెద్ద సినిమాలకు ఈ టికెట్ల పెంపు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. పెంచకపోతే కక్ష సాధింపు అంటారు. పెంచితే పెద్ద హీరోలు, నిర్మాతల సినీ పరిశ్రమ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తోందంటూ విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ పెంపు వలన ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా హైకోర్టులో మొట్టికాయలు కూడా తప్పడం లేదు. కనుక తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్దిష్ట విధానం అవలభించి దానికే కట్టుబడి ఉండటం చాలా అవసరం.