
రోషన్ కనకాల హీరోగా చేసిన ‘మోగ్లీ 2025’తో ఈ నెల 12న విడుదల కావాల్సి ఉండగా, బాలకృష్ణ సినిమా అఖండ-2 కోసం ఒకరోజు వాయిదా వేసుకోక తప్పలేదు. ఈ నెల 5న అఖండ-2 విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఆర్ధిక లావాదేవీల విషయంలో న్యాయ వివాదం తలెత్తడంతో మద్రాస్ హైకోర్టు అఖండ-2 విడుదల చేయకుండా స్టే విధించింది. ఆ సమస్య పరిష్కరించుకొని స్టే తొలగడంతో అఖండ-2 ఈ నెల 12న విడుదల కాబోతోంది. కనుక దాని కోసం‘మోగ్లీ 2025’ ఓ రోజు వాయిదా వేసుకోక తప్పలేదు. కానీ డిసెంబర్ 12న ‘మోగ్లీ 2025’ ప్రీమియర్స్ వేస్తామని ప్రకటించారు.
ఈ సినిమాలో రోషన్ కనకాలకు జోడీగా సాక్షి మధోల్కర్ నటించింది. బండి సంజయ్ సరోజ్ కుమార్, హర్ష చెముడు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ కధ, దర్శకత్వం చేశారు. ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ, కెమెరా: ఎం రామమూర్తి, ఎడిటింగ్: పవన్ కళ్యాణ్, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నారాజ్ మడిగొండ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 42గా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మాతలు.