
వంశీకృష్ణ మల్ల దర్శకత్వంలో హర్ష, అనురూప్, ఇనన్య సుల్తానా, లతా రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేసిన ‘మదం’ టీజర్ అక్టోబర్ 31న విడుదల కాగా నేడు కార్తీకపౌర్ణమి సందర్భంగా శివోహం అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఓ మారుమూల గ్రామంలో అడవులను నమ్ముకుని జీవించే గ్రామీణులు పోలీసుల చేతిలో ఏవిదంగా నరకం అనుభవిస్తుంటారో ఈ సినిమాలో చూపారు. కనుక ఈ సినిమాకి ‘మదం’ అనే పేరు చక్కగా సరిపోతుంది.
దర్శకుడు వంశీకృష్ణ వ్రాసిన శివోహం అనే ఈపాటకి డావ్జండ్ సంగీతం అందించగా దాసరి మేఘన నాయుడు, డావ్జండ్ కలిసి పాడారు.
ఈ సినిమాకి కధ: రమేష్ బాబు కోయ, సంగీతం: డావ్జండ్, కెమెరా: రవికుమార్ వి, ఎడిటింగ్: నందమూరి తారక రామారావు చేస్తున్నారు.
అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో ఏకైవ బ్యానర్పై సూర్యదేవర రవీంద్రనాథ్, రమేష్ బాబు కోయ కలిసి ఈ సినిమాని 5 భాషల్లో నిర్మిస్తున్నారు.