
ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు తంత్ర రక్షకుడు ‘అనగామ బలి’గా నటించారు. ఈరోజు ఆయన పోస్టర్ విడుదల చేశారు. రేపు (ఆదివారం) విశాఖపట్నం, ఆర్కే బీచ్లో సాయంత్రం 5 గంటల నుంచి మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది.
ఈ సినిమాలో ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ దుష్టశక్తిగా మంచు మనోజ్ నటించగా అతనిని ఎదుర్కొనే ‘సూపర్ యోధ’గా తేజా సజ్జా నటించారు.
ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రీతికా నాయక్ నటించగా శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేస్తున్నారు.
మిరాయ్ సినిమాని సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లో నిర్మిస్తున్న మిరాయ్ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.