
మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ద్విభాషా చిత్రం ‘మదరాసీ’ పాన్ ఇండియా మూవీగా అదే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. కనుక మదరాసీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్ జరుగబోతోంది. ఈ ఈవెంట్కు హాజరవ్వాలనుకునే వారు పాసుల కోసం http://shreyas.media/m వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
ఈ సినిమాలో విద్యుత్ జమ్మవల్, బిజూ మీనన్, విక్రాంత్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్పై ఎన్.శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఏఆర్. మురుగదాస్; సంగీతం: అనిరుద్ రవిచంద్రన్: కెమెరా: సుదీప్ ఎలామన్ చేస్తున్నారు.
తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది.