
సుజీత్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఓజీ’ నుంచి సువ్వీ సువ్వీ అంటూ సాగే రెండో పాట నేడు వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. కళ్యాణ్ చక్రవర్తి వ్రాసిన ఈ పాటకు తమన్ స్వరపరిచి సంగీతం అందించగా శృతి రంజని శ్రావ్యంగా పాడారు. విశేషమేమిటంటే, సినిమాలో హీరో, హీరోయిన్ల మీద తీసిన వీడియో సాంగ్ బదులు ఆర్కెస్ట్రాలో పాడిన పాటని విడుదల చేశారు. పాట చివరిలో హీరో, హీరోయిన్లని చూపించారు. పాట,, సాహిత్యం, సంగీతం చాలా చక్కగా ఉన్నాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతోంది.