
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ‘ఓజీ’ నుంచి ఇటీవలే ‘ఫైర్ స్టార్మ్’ పేరుతో తోలిపాట విడుదల చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా రెండో పాట విడుదల చేయబోతున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నేడు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆరోజు ఉదయం 10.08 గంటలకు సువ్విసువ్వీ అంటూ సాగే రెండో పాట విడుదల చేస్తామని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతోంది.