
హరిహర వీరమల్లు నిరాశ పరచడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ‘ఓజీ’పై ఆశలు పెట్టుకొని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న పూర్తి యాక్షన్ చిత్రం కనుక తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.
ఇటీవలే ‘ఫైర్ స్టార్మ్’ పేరుతో తోలిపాట విడుదల చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా రెండో పాట విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతోంది.