
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా చేస్తున్న ‘కిష్కిందపురి’ టీజర్ ఆగస్ట్ 15 సందర్భంగా రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేడు విడుదలైన కూలీ, వార్-2 సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కిష్కిందాపురి టీజర్ చూడవచ్చు. ఈ విషయం తెలియజేస్తూ ‘సువర్ణమాయ రేడియో స్టేషన్ మీ రాక ఎదురు చూస్తుంది...అంటూ వేసిన పోస్టర్ కూడా చాలా వెరైటీగా ఆకట్టుకునేలా ఉంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: శామ్ సీఎస్, చైతన్ భారద్వాజ్, ఆర్ట్: శివ కామేష్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, అడిషనల్ స్కీన్ ప్లే: బాల గణేష్.
షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలకాబోతోంది.
సువర్ణమాయ రేడియో స్టేషన్ మీ రాక కోసం ఎదురు చూస్తుంది📻🥶#KishkindhapuriTeaser will be broadcasting From August 15th at 4:05 PM💥⏳#Kishkindhapuri GRAND RELEASE WORLDWIDE ON SEPTEMBER 12th ❤🔥@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7  @chaitanmusic… pic.twitter.com/M6CcP4Zza1