
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘కాంత’ నుంచి ‘పసి మనసే...’ అంటూ సాగే పాట విడుదలైంది. కృష్ణకాంత్ వ్రాసిన ఈ పాటని జాను చందర్, శివం కలిసి స్వరపరిచి సంగీతం సమకూర్చగా ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్కే కలిసి మృదుమధురంగా పాడారు.
ఈ సినిమాలో సముద్రఖని, రానా దగ్గుబాటి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: జాను చందర్, కెమెరా: డేనీ సంచేజ్ లోపెజ్, ఎడిటర్: ల్యూవెలిన్ ఆంథనీ గోన్సాల్వెస్, ఆర్ట్ డైరెక్టర్: రామలింగం చేశారు.
స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోం వర్గీస్ కలిసి నిర్మిస్తున్న ‘కాంత’ సెప్టెంబర్ 12న విడుదల కాబోతోంది.