
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాజాసాబ్’ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈలోగా రిలీజ్ డేట్ గురించి రోజుకో మాట వినిపిస్తోంది. కానీ నిర్మాత వారికి సంతోషం కలిగించే వార్త చెప్పారు.
తాజా ఇంటర్వ్యూలో, “తెలుగు బయ్యర్స్ జనవరి 9న సంక్రాంతికి ముందు విడుదల చేద్దామని చెపుతున్నారు. కానీ హిందీ బయ్యర్లు డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు. కనుక డిసెంబర్ 5 లేదా 6 తేదీలలో రిలీజ్ చేసినట్లయితే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా కలిసి వస్తాయని మేము భావిస్తున్నాము. ఒకవేళ సంక్రాంతికి విడుదల చేస్తే రాజాసాబ్ వలన మిగిలిన సినిమాలకు, వాటి వలన మా రాజాసాబ్కు ఇబ్బంది కలుగుతుంది. కనుక డిసెంబర్ 5 లేదా 6 తేదీలలోనే రాజసాబ్ రిలీజ్ చేయాలనుకున్తున్నాము.
ఇక సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. సాంగ్స్ ఇంకా చేయాలి. వీఎఫ్ఎక్స్ పనులు జోరుగా సాగుతున్నాయి,” అని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.