అనుపమ పరదా ముందు మరో పాట.. ఎగరేయి నీ రెక్కలే

శతమానం భవతి సినిమాతో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలే చేసి మరింత దగ్గరైంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్ర చేస్తున్న ‘పరదా’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి ‘యత్ర నార్యస్థు.. ‘అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయగా ఈరోజు ‘ఎగరేయి నీ రెక్కలే..’ అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. వనమాలి వ్రాసిన ఈ పాటకి గోపీ సుందర్ సంగీతం అందించి స్వరపరచగా రితేష్ జీ రావు పాడారు. 

ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో  దర్శన్ రాజేంద్రన్, సంగీత తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: మృధుల్ సుజీత్ సేన్‌, ఆర్ట్: శ్రీనివాస్ కాళింగ, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు. 

ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది.