
మల్లేశం, 8 ఏఎం మెట్రో సినిమాలతో మెప్పించిన రాజ్ ఆర్ దర్శకత్వంలో 1990va దశకంలో జరిగిన కొన్ని యధార్ధ ఘటనల ఆధారంగా తీస్తున్న ‘23’ నుంచి లాలిపాట ఇంకా అవ్వనేలేదే.. అనే మృధుమధురమైన పాట విడుదల చేశారు. ఇదివరకు ఈ పాట ఆడియో విడుదల చేయగా ఈరోజు పూర్తి వీడియో సాంగ్ విడుదల చేశారు. రహమాన్ వ్రాసిన ఈ పాటని మార్క్ కే రాబిన్ స్వరపరిచి సంగీతం అందించగా సింధుజా శ్రీనివాసన్ మృధుమధురంగా ఆలపించారు.
ఈ సినిమాలో జాన్సీ, తేజ, తన్మయి, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
1991లో జరిగిన చుండూరులో దళితుల ఊచకోత, 1993లో చిలకలూరిపేటలో బస్సులో సజీవదహనం, 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.
ఈ సినిమాకి సంగీతం: మార్క్ కే రాబిన్, కెమెరా: సన్నీ కూరపాటి, డైలాగ్స్: ఇండస్ మార్టిన్, పాటలు: చంద్రబోస్, రహమాన్, ఇండస్ మార్టిన్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల చేశారు.
“మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?” అని ప్రశ్నిస్తూ తీసిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.
స్టూడియో 99 బ్యానర్పై తీసిన ఈ సినిమాని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా త్వరలో విడుదల చేయబోతోంది.