
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కలిసి చేయబోతున్న సినిమాలో చేయబోతున్న నటీనటుల వివరాలను పూరీ-ఛార్మీ స్వయంగా ప్రకటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి టబు, రాధిక ఆప్టేల పేర్లను ప్రకటించిన తర్వాత ఇప్పుడు సంయుక్తని తమ సినిమాలోకి తీసుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఆమె బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ-2లో కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు మొదట ‘బెగ్గర్’ అని టైటిల్ అనుకున్నప్పటికీ తర్వాత ‘భవతి భిక్షాం దేహి’గా మార్చినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగానే ఈ నెలాఖరులోగా షూటింగ్ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.
ఈ సినిమాని పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు.
Grace in her stride. Fire in her eyes.
Welcoming the stunning @iamsamyuktha_ on board into the electrifying world of #PuriSethupathi ❤️🔥❤️🔥❤️🔥
A #PuriJagannadh film
Starring Makkalselvan @VijaySethuOffl, #Tabu, and @OfficialViji
Produced by Puri Jagannadh & @Charmmeofficial under… pic.twitter.com/RzlZMBs4DJ