.jpg)
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘తమ్ముడు’ సినిమా నుంచి నేడు “భూ.. అంటూ భూతం వస్తే..” అంటూ సాగే చక్కటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. సింహావచ్చల మన్నెల వ్రాసిన ఈ పాటని బి ఆజనీష్ లోక్నాథ్ స్వరపరిచి సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోలా మృధుమధురంగా పాడారు.
ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: బి. ఆజనీష్ లోక్నాథ్, కెమెరా: కేవీ గుహ్యం, సమీర్ రెడ్డి, సేతు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ చేస్తున్నారు.
వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రాజు, సతీష్ కలిసి తమ్ముడిని జూలై 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.