ముంబయిలో కుబేరా సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌ షురూ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలలో ‘కుబేర’ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఈరోజు కుబేరా టీమ్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సినిమా ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. మంగళవారం సాయంత్రం ముంబయిలో కుబేర నుంచి మరో పాట ‘పిప్పీ పిప్పీ డుమ్ డుమ్..’ అంటూ సాగే మరోపాటని విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్, రష్మికలతో పాటు పలువురు పాల్గొన్నారు.   

ఈ సినిమాలో రష్మిక మందన, జిమ్ సరబ్, సాయాజీ ఏక్‌నాధ్ షిండే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.