ఆదివారం సాయంత్రం అఖండ-2 టీజర్‌ రిలీజ్‌!

బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో మళ్ళీ వారిద్దరూ కలిసి చేస్తున్న అఖండ-2పై చాలా భారీ అంచనాలున్నాయి. అఖండ-2 డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయంటే ఏఎ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్దం చేసుకోవవచ్చు.

ఆదివారం ఉదయం 10.54 గంటలకు ఏఎ సినిమాకి సంబందించి అప్‌డేట్‌ ఇస్తామని 14 రీల్స్ ప్లస్ ఎక్స్‌ వేదికగా నిన్న తెలియజేసింది. చెప్పినట్లుగానే ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు అఖండ-2 టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఏఎ విషయం తెలియజేస్తూ నందీశ్వరుడు బొమ్మ, డమరుకంతో ఉన్న త్రిశూలం పోస్టర్ విడుదల చేసింది.  

అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.   

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో అఖండ-2 నిర్మిస్తున్న అఖండ-2 సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.