
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఘాటి’ సినిమా జూలై 11న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
“ఆమె బాధితురాలు... క్రిమినల్... లిజెండ్... ఇప్పుడు ఘాటిని ఏలేందుకు వస్తున్నారు,” అంటూ ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి దర్శకత్వం క్రిష్ ఇదివరకే చెప్పేశారు.
ఈ సినిమాకు సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; కెమెరా: కాటసాని మనోజ్ రెడ్డి, ఆర్ట్: తోట తరణి, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు.
రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు కలిసి ఈ సినిమా యూవీ క్రియెషన్స్ బ్యానర్పై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.