
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో ‘కుబేర’ ఈ నెల 20న విడుదల కాబోతోంది. కుబేర నుంచి ’ అనగనగా కధ... అందరికీ తెలిసిన కధ..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
చిన్న చిన్న పదాలతో లోకం తీరు గురించి చాలా అద్భుతంగా వివరించారు ఈ పాట రచయిత చంద్రబోస్. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటని హైడె కార్తీక్, కరీముల్లా కలిసి పాడారు.
ఈ సినిమాలో నాగార్జున కోటీశ్వరుడైన వ్యాపారవేత్తగా నటిస్తుండగా ధనుష్ బిచ్చగాడిగా నటించారు. కుబేరలో రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.