దీపావళికి డూడ్!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళంలో కూడా సినిమాలు తీస్తోంది. తమిళ్ మైత్రీ ప్రొడక్షన్: 4గా డూడ్ అనే సినిమా తీస్తోంది.

ఈ సినిమాలో యువనటుడు ప్రదీప్, మమిత బైజు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శరత్ కుమార్‌, రోహిణీ మోలెట్టి,   ద్రావిడ్ సెల్వం, సురేష్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం కీర్తీస్వరన్, సంగీతం: సాయి అభయంకర్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి 5 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.