కిష్కిందపురి ఫస్ట్ గ్లింమ్స్‌.. మరో హర్రర్

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న కిష్కిందపురి సినిమా ఫస్ట్ గ్లింమ్స్‌ నేడు విడుదలైంది. “కొన్ని తలుపులు ఎన్నడూ తెరవకూడదు.. కొన్ని శబ్ధాలు ఎన్నడూ వినకూడదు.. కొన్ని ప్రదేశాలు ఎన్నడూ మరిచిపోకూడదు..” అంటూ భూత్  బంగ్లాలో హీరో బృందం ప్రవేశించిన దృశ్యాలను ఫస్ట్ గ్లింమ్స్‌లో చూపారు. కనుక ఇదో హర్రర్ సినిమా అని స్పష్టమైంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: శామ్ సీఎస్, చైతన్ భారద్వాజ్, ఆర్ట్: శివ కామేష్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, అడిషనల్ స్కీన్‌ ప్లే: బాల గణేష్. 

 షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై-ఆగస్ట్ నెలల్లో విడుదల కాబోతోంది.