
బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వస్తున్న ‘జాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆవస హోటల్, హైదరాబాద్లో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు చందు మొండేటి ముఖ్య అతిధిగా రాబోతున్నారని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 3న విడుదల చేసిన జాక్ ట్రైలర్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, రాధన్, అచు రాజమణి, శామ్; కెమెరా: విజయ్ దేవరకొండ కే చక్రవర్తి, ఎడిటింగ్: నవీన్ నూలి, కొరియోగ్రఫీ: రాజు సుందరం చేశారు.
శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు కలిసి నిర్మించిన జాక్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.